‘ఆది పురుష్’పై ట్రోలింగ్స్పై దిల్ రాజు కౌంటర్స్.!
- October 07, 2022
దసరా కానుకగా రిలీజైన ‘ఆది పురుష్’ టీజర్కి సంబంధించి రకరకాల ట్రోలింగ్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రామాయాణం అనే కాన్సెప్ట్ తీసుకుని, మరీ ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా.? అంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చాలానే పోటెత్తుతున్నాయి.
రాముడి పాత్ర మొదలుకొని, హనుమంతుడు, ముఖ్యంగా రావణాసురుడి పాత్రల చిత్రీకరణలపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. రావణాసురుడి పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ పక్షి వాహనంపై పయనిస్తాడా.? అంటూ తాజాగా మరో వివాదం రేగుతోంది.
ఈ వివాదాలన్నింటినీ ఖండిస్తూ దిల్ రాజు తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని నిమిషాల పాటు సాగే టీజర్ని చూసి సినిమా మొత్తాన్ని ఎలా తప్పు పడతారు.? ఓం రౌత్ మంచి దర్శకుడు. ఆయన రూపొందించిన సినిమాలో పాత్రల చిత్రీకరణను తప్పుపట్టడం ఎంతవరకూ సబబు.? అని ఆయన ప్రశ్నించారు.
నేటి తరమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా అర్ధమయ్యే రీతిలో ఔం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయినా ఈ మధ్య ప్రతీ సినిమాకి ముందే నెగిటివిటీ ప్రచారం చేయడమన్నది ట్రెండింగ్ అయిపోయింది. అలాగే ‘ఆది పురుష్’ సినిమా విషయంలోనూ జరుగుతుంది. అంతేకాదు, ‘బాహుబలి’ అంతటి సినిమా కూడా ఈ నెగిటివ్ ట్రోల్స్ నుంచి తప్పించుకోలేకపోయింది. అయినా, ఆ సినిమా ఏ స్థాయి విజయం అందుకుందో తెలిసిందే కదా.
‘ఆది పురుష్’ కూడా రిలీజ్ అయ్యేంతవరకూ దాని రేంజ్ తెలీదు. జవవరిలో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటుందన్న నమ్మకం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం









