‘ఆది పురుష్’పై ట్రోలింగ్స్పై దిల్ రాజు కౌంటర్స్.!
- October 07, 2022
దసరా కానుకగా రిలీజైన ‘ఆది పురుష్’ టీజర్కి సంబంధించి రకరకాల ట్రోలింగ్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రామాయాణం అనే కాన్సెప్ట్ తీసుకుని, మరీ ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా.? అంటూ సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ చాలానే పోటెత్తుతున్నాయి.
రాముడి పాత్ర మొదలుకొని, హనుమంతుడు, ముఖ్యంగా రావణాసురుడి పాత్రల చిత్రీకరణలపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. రావణాసురుడి పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ పక్షి వాహనంపై పయనిస్తాడా.? అంటూ తాజాగా మరో వివాదం రేగుతోంది.
ఈ వివాదాలన్నింటినీ ఖండిస్తూ దిల్ రాజు తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని నిమిషాల పాటు సాగే టీజర్ని చూసి సినిమా మొత్తాన్ని ఎలా తప్పు పడతారు.? ఓం రౌత్ మంచి దర్శకుడు. ఆయన రూపొందించిన సినిమాలో పాత్రల చిత్రీకరణను తప్పుపట్టడం ఎంతవరకూ సబబు.? అని ఆయన ప్రశ్నించారు.
నేటి తరమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా అర్ధమయ్యే రీతిలో ఔం రౌత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయినా ఈ మధ్య ప్రతీ సినిమాకి ముందే నెగిటివిటీ ప్రచారం చేయడమన్నది ట్రెండింగ్ అయిపోయింది. అలాగే ‘ఆది పురుష్’ సినిమా విషయంలోనూ జరుగుతుంది. అంతేకాదు, ‘బాహుబలి’ అంతటి సినిమా కూడా ఈ నెగిటివ్ ట్రోల్స్ నుంచి తప్పించుకోలేకపోయింది. అయినా, ఆ సినిమా ఏ స్థాయి విజయం అందుకుందో తెలిసిందే కదా.
‘ఆది పురుష్’ కూడా రిలీజ్ అయ్యేంతవరకూ దాని రేంజ్ తెలీదు. జవవరిలో రిలీజ్ కాబోయే ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల అంచనాల్ని అందుకుంటుందన్న నమ్మకం వ్యక్తం చేశారాయన.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







