బహ్రెయిన్ పార్లమెంట్, పురపాలక ఎన్నికలు.. ఓటేయనున్న 344,713 మంది
- October 07, 2022
బహ్రెయిన్: 2022 నవంబర్ 12వ తేదీన జరగబోయే పార్లమెంటరీ, మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 344,713 మంది పౌరులు ఓటు వేయనున్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అప్పీళ్లపై కాంపిటెంట్ న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పది ఎన్నికల జిల్లాల్లోని క్యాపిటల్ గవర్నరేట్లో 665,148 మంది ఓటర్లు ఉన్నారు. ముహరక్లోని ఎనిమిది జిల్లాల ఎలక్టోరల్ బ్లాక్లో 81,637 మంది ఓటర్లు, 12-జిల్లా ఉత్తరం బ్లాక్ లో 121,581 మంది ఓటర్లు, 10-జిల్లాల దక్షిణం బ్లాక్ లో 75,347 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ పోలింగ్ బూత్ వివరాలను www.vote.bh ద్వారా తెలుసుకోవచ్చని ఎన్నికల ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మొత్తం 265,138 మంది పౌరుల ఓటరు జాబితాలను తనిఖీ చేసినట్టు లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ ప్రెసిడెంట్, పార్లమెంటరీ- మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జా తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!









