బహ్రెయిన్ పార్లమెంట్, పురపాలక ఎన్నికలు.. ఓటేయనున్న 344,713 మంది
- October 07, 2022
బహ్రెయిన్: 2022 నవంబర్ 12వ తేదీన జరగబోయే పార్లమెంటరీ, మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 344,713 మంది పౌరులు ఓటు వేయనున్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన అప్పీళ్లపై కాంపిటెంట్ న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పది ఎన్నికల జిల్లాల్లోని క్యాపిటల్ గవర్నరేట్లో 665,148 మంది ఓటర్లు ఉన్నారు. ముహరక్లోని ఎనిమిది జిల్లాల ఎలక్టోరల్ బ్లాక్లో 81,637 మంది ఓటర్లు, 12-జిల్లా ఉత్తరం బ్లాక్ లో 121,581 మంది ఓటర్లు, 10-జిల్లాల దక్షిణం బ్లాక్ లో 75,347 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు తమ పోలింగ్ బూత్ వివరాలను www.vote.bh ద్వారా తెలుసుకోవచ్చని ఎన్నికల ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మొత్తం 265,138 మంది పౌరుల ఓటరు జాబితాలను తనిఖీ చేసినట్టు లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ ప్రెసిడెంట్, పార్లమెంటరీ- మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జా తెలిపారు.
తాజా వార్తలు
- అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- ఖతార్ లో ఆకట్టుకుంటున్న త్రోబ్యాక్ ఫుడ్ ఫెస్టివల్..!!
- డీప్ఫేక్ ఆఫెన్స్ ప్రపొజల్.. అధ్యయనానికి సిఫార్సు..!!
- అత్యవసర విదేశాంగ మంత్రివర్గ సమావేశానికి OIC పిలుపు..!!
- యూఏఈలో ఈద్ అల్ ఫితర్ సెలవులు.. డేట్స్ అనౌన్స్..!!
- కువైట్ లో మేజర్ సెక్యూరిటీ డ్రైవ్..!!
- ప్రధాని పై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తేజస్ జెట్ ప్రమాదం పై ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు ప్రారంభం
- TANA అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
- కువైట్ సార్వభౌమత్వానికి యూఏఈ మద్దతు..!!









