మాదకద్రవ్యాల వ్యాపారికి 10 సంవత్సరాల జైలు, BD5,000 జరిమానా
- October 09, 2022బహ్రెయిన్: ఒక డ్రగ్ పెడ్లర్కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు BD5,000 జరిమానాను అప్పీల్ కోర్ట్ ఖరారు చేసింది. దీంతో పాటు జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఆసియన్ జాతీయుడైన వ్యక్తి రాజ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, పక్కా సమాచారం ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు పన్నిన ఉచ్చులో పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. రహస్య ఆపరేషన్ ద్వారా అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక రహస్య ఏజెంట్ అనుమానితుడిని సంప్రదించాడని, BD150 విలువైన 'గంజాయి'ని కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇవ్వగా.. దానికి అనుమానితుడు అంగీకరించాడు. పోలీసుల బృందం నిఘాలో ఉంచిన సల్మాబాద్ ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై గంజాయి అమ్మకం, మాదకద్రవ్యాలను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేశాడని అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!