మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, చరణ్.!
- October 10, 2022
కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కనీ వినీ ఎరుగని కాంబినేషన్. మెగాస్టార్ సతీమణి సురేఖ కలల ప్రాజెక్టుగా రూపొందిన ఈ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది. అరుదైన కాంబినేషన్ ఆ రకంగా వేస్ట్ అయిపోయిందన్న ఆవేదన మెగా అభిమానుల్లో నరనరాల నిండిపోయింది.
ఆ లోటు తీర్చేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ సారి ఈ కాంబినేషన్కి డైరెక్షన్ బాధ్యతలు తీసుకోనున్నారు మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ సినిమాతో మోహన్ రాజాపై గట్టిగా నమ్మకం ఏర్పడింది మెగాస్టార్ చిరంజీవికి.
దాంతో, డిజప్పాయింట్ చేసిన ఈ కాంబినేషన్తో మరోసారి హిట్ కొట్టి, ఫ్యాన్స్ని శాటిస్పై చేయాలని అనుకుంటున్నారట. ఈ అతిపెద్ద బాధ్యతను మోహన్ రాజా భుజాలపై వేసినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ రీమేక్ కోసం వేట మొదలు పెట్టారట. త్వరలోనే డీటెయిల్స్ బయటికి రానున్నాయని సమాచారం.
ఈ కాంబినేషన్ మూవీని కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారట. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రికార్డులు బ్రేక్ చేసే పనిలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్, శంకర్ మూవీతో బిజీగా వున్నారు.
తాజా వార్తలు
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!
- సరైన సమయంలో చర్చలు: సయ్యద్ బదర్
- ఇటలీ ప్రధానమంత్రితో అమీర్ ద్వైపాక్షిక సంబంధాలు..!!
- రమదాన్ స్పెషల్..మదీనాకు షటిల్ బస్సులు..!!









