మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, చరణ్.!
- October 10, 2022
కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కనీ వినీ ఎరుగని కాంబినేషన్. మెగాస్టార్ సతీమణి సురేఖ కలల ప్రాజెక్టుగా రూపొందిన ఈ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది. అరుదైన కాంబినేషన్ ఆ రకంగా వేస్ట్ అయిపోయిందన్న ఆవేదన మెగా అభిమానుల్లో నరనరాల నిండిపోయింది.
ఆ లోటు తీర్చేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ సారి ఈ కాంబినేషన్కి డైరెక్షన్ బాధ్యతలు తీసుకోనున్నారు మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ సినిమాతో మోహన్ రాజాపై గట్టిగా నమ్మకం ఏర్పడింది మెగాస్టార్ చిరంజీవికి.
దాంతో, డిజప్పాయింట్ చేసిన ఈ కాంబినేషన్తో మరోసారి హిట్ కొట్టి, ఫ్యాన్స్ని శాటిస్పై చేయాలని అనుకుంటున్నారట. ఈ అతిపెద్ద బాధ్యతను మోహన్ రాజా భుజాలపై వేసినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ రీమేక్ కోసం వేట మొదలు పెట్టారట. త్వరలోనే డీటెయిల్స్ బయటికి రానున్నాయని సమాచారం.
ఈ కాంబినేషన్ మూవీని కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారట. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రికార్డులు బ్రేక్ చేసే పనిలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్, శంకర్ మూవీతో బిజీగా వున్నారు.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









