మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, చరణ్.!
- October 10, 2022
కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కనీ వినీ ఎరుగని కాంబినేషన్. మెగాస్టార్ సతీమణి సురేఖ కలల ప్రాజెక్టుగా రూపొందిన ఈ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది. అరుదైన కాంబినేషన్ ఆ రకంగా వేస్ట్ అయిపోయిందన్న ఆవేదన మెగా అభిమానుల్లో నరనరాల నిండిపోయింది.
ఆ లోటు తీర్చేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ సారి ఈ కాంబినేషన్కి డైరెక్షన్ బాధ్యతలు తీసుకోనున్నారు మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ సినిమాతో మోహన్ రాజాపై గట్టిగా నమ్మకం ఏర్పడింది మెగాస్టార్ చిరంజీవికి.
దాంతో, డిజప్పాయింట్ చేసిన ఈ కాంబినేషన్తో మరోసారి హిట్ కొట్టి, ఫ్యాన్స్ని శాటిస్పై చేయాలని అనుకుంటున్నారట. ఈ అతిపెద్ద బాధ్యతను మోహన్ రాజా భుజాలపై వేసినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ రీమేక్ కోసం వేట మొదలు పెట్టారట. త్వరలోనే డీటెయిల్స్ బయటికి రానున్నాయని సమాచారం.
ఈ కాంబినేషన్ మూవీని కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారట. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రికార్డులు బ్రేక్ చేసే పనిలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్, శంకర్ మూవీతో బిజీగా వున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







