మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి, చరణ్.!
- October 10, 2022
కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆచార్య’. కనీ వినీ ఎరుగని కాంబినేషన్. మెగాస్టార్ సతీమణి సురేఖ కలల ప్రాజెక్టుగా రూపొందిన ఈ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది. అరుదైన కాంబినేషన్ ఆ రకంగా వేస్ట్ అయిపోయిందన్న ఆవేదన మెగా అభిమానుల్లో నరనరాల నిండిపోయింది.
ఆ లోటు తీర్చేందుకు మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ సారి ఈ కాంబినేషన్కి డైరెక్షన్ బాధ్యతలు తీసుకోనున్నారు మోహన్ రాజా. ‘గాడ్ ఫాదర్’ సినిమాతో మోహన్ రాజాపై గట్టిగా నమ్మకం ఏర్పడింది మెగాస్టార్ చిరంజీవికి.
దాంతో, డిజప్పాయింట్ చేసిన ఈ కాంబినేషన్తో మరోసారి హిట్ కొట్టి, ఫ్యాన్స్ని శాటిస్పై చేయాలని అనుకుంటున్నారట. ఈ అతిపెద్ద బాధ్యతను మోహన్ రాజా భుజాలపై వేసినట్లు తెలుస్తోంది. ఓ సూపర్ హిట్ రీమేక్ కోసం వేట మొదలు పెట్టారట. త్వరలోనే డీటెయిల్స్ బయటికి రానున్నాయని సమాచారం.
ఈ కాంబినేషన్ మూవీని కొణిదెల ప్రాడక్షన్స్ బ్యానర్లోనే ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారట. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి రికార్డులు బ్రేక్ చేసే పనిలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్, శంకర్ మూవీతో బిజీగా వున్నారు.
తాజా వార్తలు
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం









