క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం
- October 11, 2022
కువైట్: కువైట్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన క్రూజ్ బోట్ను కోస్ట్ గార్డ్ అడ్డగించింది. అనంతరం చేపట్టిన తనిఖీల్లో బోటులో దాచిన 90 కిలోల మత్తుపదార్థాన్ని గుర్తించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి సరుకు రవాణా యజమాని సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నభద్రతా బృందాలను ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అభినందించారు. సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్, పోర్ట్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ మన్సూర్ అల్-అవాడి, కోస్ట్ గార్డ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ అల్-మౌన్స్ ఉన్నారు.
తాజా వార్తలు
- శాన్ డియాగో మసీదులో కాల్పుల కలకలం..ఐదుగురు మృతి
- యూఏఈలో 16 భారతీయ వీసా, కాన్సులర్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్న అల్హింద్ గ్రూప్
- దుబాయ్లో 13 కమ్యూనిటీ క్లబ్లను ప్రారంభించిన AES
- డ్యూటీస్, వ్యాట్ ఛార్జీల కోసం 100-దీనార్ల పరిమితి..!!
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు.. భారత్, జీసీసీ దేశాల్లో ఆందోళన..!!
- సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!
- ఖతార్ తీరాలలో ఆయిన్ పొల్యుషన్..ఖతార్ క్లారిటీ..!!
- భారత, ఆస్ట్రియాలతో ఒమన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- నాన్ ఎమిరేటీలు కందూరాలు ధరించడంపై క్లారిటీ..!!
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం









