క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం
- October 11, 2022
కువైట్: కువైట్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన క్రూజ్ బోట్ను కోస్ట్ గార్డ్ అడ్డగించింది. అనంతరం చేపట్టిన తనిఖీల్లో బోటులో దాచిన 90 కిలోల మత్తుపదార్థాన్ని గుర్తించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి సరుకు రవాణా యజమాని సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్రూజ్ బోటులో 60 కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నభద్రతా బృందాలను ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ అభినందించారు. సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్-బర్జాస్, పోర్ట్స్ అండ్ బోర్డర్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ మన్సూర్ అల్-అవాడి, కోస్ట్ గార్డ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ తలాల్ అల్-మౌన్స్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!







