ప్రవాసులకు ‘గోల్డెన్ పెన్షన్’ ప్రకటించిన యూఏఈ
- October 11, 2022
యూఏఈ: జాతీయులు, నివాసితుల కోసం ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి నేషనల్ బాండ్లు యూఏఈలో గోల్డెన్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించాయి. యజమానులు, ఉద్యోగుల నుండి పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పెన్షన్ స్కీమ్ ను అభివృద్ధి చేసినట్లు యూఏఈ ప్రముఖ షరియా-కంప్లైంట్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ తెలిపింది. కొత్త ప్రతిపాదన నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు నెలవారీ ప్రాతిపదికన Dh100 ఆదా చేయొచ్చు. దీనిద్వారా అదనపు లాభాన్ని పొందుతారని, ఇది వారి సంస్థ అందించే గ్రాట్యుటీకి అదనంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. నేషనల్ బాండ్స్తో రిజిస్టర్ అయిన కార్పొరేట్లకు తమ ఉద్యోగుల ఆర్థిక లక్ష్యాలకు తోడ్పాటు అందించడం ఈ విశిష్ట పథకం అందుబాటులో ఉంటుందన్నారు. యూఏఈ జనాభాలో 89 శాతం నిర్వాసితులను లక్ష్యంగా చేసుకున్న ఈ పథకం కింద నేషనల్ బాండ్లు అందించే ఆకర్షణీయమైన రిటర్న్స్ ఇస్తుందని దుబాయ్కి చెందిన ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ యాజమాన్యంలోని నేషనల్ బాండ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







