6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు ముప్పవరపు వెంకయ్యనాయుడు
- October 13, 2022
న్యూఢిల్లీ: 6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ నెల 14న హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళనున్న ఆయన, అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
14వ తేదీన కౌలాలంపూర్ చేరుకున్న వెంటనే అక్కడ భారతీయ సంతతి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
15వ తేదీన మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించనున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ప్రసంగిస్తారు.16వ తేదీన సింగపూర్ చేరుకోనున్న ఆయన, అదే రోజు సాయంత్రం శ్రీ సాంస్కృతిక కళాసారధి, సింగపూర్ వారి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం 17వ తేదీ ఉదయం సింగపూర్ లో ఉన్న గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని అక్టోబర్19వ తేదీని ముప్పవరపు వెంకయ్యనాయుడు తిరిగి భారత్ చేరుకుంటారు.
తాజా వార్తలు
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- TCS ఉద్యోగుల తొలగింపు..