రెండు వారాల్లో 6 కోట్ల దినార్ల డ్రగ్స్, మద్యం సీజ్ చేసిన పోలీసులు
- October 14, 2022
కువైట్: డ్రగ్స్, మద్యం అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. షాబు అనే వ్యక్తి 300 కిలోల హషీష్, మెథాంఫేటమిన్ ను స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకొని అరెస్ట్ చేశారు. అటు గత రెండు వారాల్లో దాదాపు 6 కోట్ల దినార్ల విలువైన డ్రగ్స్, మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అందులో 23,000 మద్యం బాటిళ్లు ఉన్నాయి. గత వారం ఇద్దరు కువైట్ పౌరులు, ఒక యెమెన్ వ్యక్తి అక్రమంగా 40 కిలోల హషీష్ , 150,000 క్యాప్గాన్ డ్రగ్ టాబ్లెట్లను స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఈ నెల 11న కువైట్ కోస్ట్గార్డ్ సుమారు 3 మిలియన్ల దినార్ల వ విలువైన డ్రగ్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. అక్రమంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







