ఖర్జూరంలో డ్రగ్స్ స్మగ్లింగ్: పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభం

- October 15, 2022 , by Maagulf
ఖర్జూరంలో డ్రగ్స్ స్మగ్లింగ్: పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభం

బహ్రెయిన్: ఖర్జూరాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభమైనట్లు బహ్రెయిన్ భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ ఘటన ఆగస్టులో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. పాకిస్థాన్ నుంచి 23 ఏళ్ల వ్యక్తి వ్యవహారం అనుమానస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు స్మగ్లింగ్ విషయాన్ని వెల్లడించినట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అతను డేట్స్ లలో ప్రీగాబాలిన్ (లిరికా బ్రాండ్) ను దాచి బహ్రెయిన్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు భద్రతా దళాలు అతనిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com