జెడ్డాలో ప్రారంభమైన కూల్చివేతలు
- October 16, 2022
జెడ్డా: ఉమ్ అల్-సలామ్, కీలో -14 ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలను ప్రారంభించినట్లు జెడ్డా మురికివాడల కమిటీ వెల్లడించింది. అక్టోబర్ లోనే ఆయా ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఈ చివరి దఫాలో మొత్తం 32 ఇండ్లను కూల్చివేయనున్నట్లు ప్రకటించింది. జెడ్డాలోని మురికివాడలను అభివృద్ధి చేయడానికి, మెరుగైన జీవిత నాణ్యతను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినట్టు జెడ్డా మురికివాడల కమిటీ స్పష్టం చేసింది. పునరావాస కేంద్రాల్లోని నివాసితులకు తమ సేవలను అందిస్తూనే ఉంటామని కమిటీ తెలిపింది. వారికి అవసరమైన ఫర్నిచర్, ఆహారం, పరిహారం లేదా శాశ్వత గృహాన్ని పొందే వరకు తమ సేవలు కొనసాగుతాయని తెలిపింది. పరిహారం పొందేందుకు దరఖాస్తులను సమర్పించే ప్రక్రియలను పూర్తి చేయాలని నివాసితులను జెడ్డా కమిటీ కోరింది. మురికివాడల తొలగింపునకు సంబంధించిన పరిహారం కోసం జెడ్డా మేయర్లటీ డిజిటల్ పోర్టల్ www.jeddah.gov.sa ద్వారా పరిహారం కోసం అభ్యర్థనలను పంపాలని సూచించింది. మరింత సమాచారం కోసం యూనిఫైడ్ కమ్యూనికేషన్ సెంటర్ (920022447) లేదా ఇ-మెయిల్ [email protected] ద్వారా , Twitter ప్లాట్ఫారమ్ @spgacareలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









