జెడ్డాలో ప్రారంభమైన కూల్చివేతలు
- October 16, 2022
జెడ్డా: ఉమ్ అల్-సలామ్, కీలో -14 ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలను ప్రారంభించినట్లు జెడ్డా మురికివాడల కమిటీ వెల్లడించింది. అక్టోబర్ లోనే ఆయా ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఈ చివరి దఫాలో మొత్తం 32 ఇండ్లను కూల్చివేయనున్నట్లు ప్రకటించింది. జెడ్డాలోని మురికివాడలను అభివృద్ధి చేయడానికి, మెరుగైన జీవిత నాణ్యతను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినట్టు జెడ్డా మురికివాడల కమిటీ స్పష్టం చేసింది. పునరావాస కేంద్రాల్లోని నివాసితులకు తమ సేవలను అందిస్తూనే ఉంటామని కమిటీ తెలిపింది. వారికి అవసరమైన ఫర్నిచర్, ఆహారం, పరిహారం లేదా శాశ్వత గృహాన్ని పొందే వరకు తమ సేవలు కొనసాగుతాయని తెలిపింది. పరిహారం పొందేందుకు దరఖాస్తులను సమర్పించే ప్రక్రియలను పూర్తి చేయాలని నివాసితులను జెడ్డా కమిటీ కోరింది. మురికివాడల తొలగింపునకు సంబంధించిన పరిహారం కోసం జెడ్డా మేయర్లటీ డిజిటల్ పోర్టల్ www.jeddah.gov.sa ద్వారా పరిహారం కోసం అభ్యర్థనలను పంపాలని సూచించింది. మరింత సమాచారం కోసం యూనిఫైడ్ కమ్యూనికేషన్ సెంటర్ (920022447) లేదా ఇ-మెయిల్ [email protected] ద్వారా , Twitter ప్లాట్ఫారమ్ @spgacareలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







