జెడ్డాలో ప్రారంభమైన కూల్చివేతలు
- October 16, 2022
జెడ్డా: ఉమ్ అల్-సలామ్, కీలో -14 ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలను ప్రారంభించినట్లు జెడ్డా మురికివాడల కమిటీ వెల్లడించింది. అక్టోబర్ లోనే ఆయా ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది. ఈ చివరి దఫాలో మొత్తం 32 ఇండ్లను కూల్చివేయనున్నట్లు ప్రకటించింది. జెడ్డాలోని మురికివాడలను అభివృద్ధి చేయడానికి, మెరుగైన జీవిత నాణ్యతను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ ను చేపట్టినట్టు జెడ్డా మురికివాడల కమిటీ స్పష్టం చేసింది. పునరావాస కేంద్రాల్లోని నివాసితులకు తమ సేవలను అందిస్తూనే ఉంటామని కమిటీ తెలిపింది. వారికి అవసరమైన ఫర్నిచర్, ఆహారం, పరిహారం లేదా శాశ్వత గృహాన్ని పొందే వరకు తమ సేవలు కొనసాగుతాయని తెలిపింది. పరిహారం పొందేందుకు దరఖాస్తులను సమర్పించే ప్రక్రియలను పూర్తి చేయాలని నివాసితులను జెడ్డా కమిటీ కోరింది. మురికివాడల తొలగింపునకు సంబంధించిన పరిహారం కోసం జెడ్డా మేయర్లటీ డిజిటల్ పోర్టల్ www.jeddah.gov.sa ద్వారా పరిహారం కోసం అభ్యర్థనలను పంపాలని సూచించింది. మరింత సమాచారం కోసం యూనిఫైడ్ కమ్యూనికేషన్ సెంటర్ (920022447) లేదా ఇ-మెయిల్ [email protected] ద్వారా , Twitter ప్లాట్ఫారమ్ @spgacareలో సంప్రదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









