BD42,000 ఫోన్ స్కామ్.. ముఠా అరెస్ట్
- October 16, 2022
బహ్రెయిన్: BD42,000 విలువైన ఫోన్ స్కామ్ కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ముఠా బ్యాంకు ఖతాలను స్తంభింపచేసి సొమ్ము రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించేందుకు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఒక ఫోన్ కాల్ తర్వాత అతని బ్యాంక్ ఖాతా నుండి BD11,000 కోల్పోయిన పౌరుడి ఫిర్యాదును విచారించగా.. ఆసియా జాతీయుల ముఠాను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిఘా అధికారులు బ్యాంకులతో సమన్వయంతో ముఠా లావాదేవీలను, వారి లబ్ధిదారులను ట్రాక్ చేయగలిగారన్నారు. నిందితులు మోసానికి ఉపయోగించిన పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురిని ట్రాప్ చేసి వారి ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును నిందితులు స్వాహా చేసినట్లు డైరెక్టర్ జనరల్ వివరించారు.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!









