BD42,000 ఫోన్ స్కామ్.. ముఠా అరెస్ట్
- October 16, 2022
బహ్రెయిన్: BD42,000 విలువైన ఫోన్ స్కామ్ కు పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ముఠా బ్యాంకు ఖతాలను స్తంభింపచేసి సొమ్ము రికవరీ చేసినట్లు వెల్లడించారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించేందుకు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఒక ఫోన్ కాల్ తర్వాత అతని బ్యాంక్ ఖాతా నుండి BD11,000 కోల్పోయిన పౌరుడి ఫిర్యాదును విచారించగా.. ఆసియా జాతీయుల ముఠాను గుర్తించినట్లు పేర్కొన్నారు. నిఘా అధికారులు బ్యాంకులతో సమన్వయంతో ముఠా లావాదేవీలను, వారి లబ్ధిదారులను ట్రాక్ చేయగలిగారన్నారు. నిందితులు మోసానికి ఉపయోగించిన పరికరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పలువురిని ట్రాప్ చేసి వారి ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును నిందితులు స్వాహా చేసినట్లు డైరెక్టర్ జనరల్ వివరించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







