మేనేజర్ల అనుమతితో ‘మూన్లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి..
- October 21, 2022
మేనేజర్ల అనుమతితో ‘మూన్లైటింగ్’కు ఇన్ఫోసిస్ అనుమతి..
ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉద్యోగుల ‘మూన్లైటింగ్’కు అనుమతించింది. అయితే, అనేక షరతులు విధించింది. కొద్ది రోజులుగా ‘మూన్లైటింగ్’పై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఒక కంపెనీలో పని చేస్తూ, అలాంటి మరో కంపెనీలో రెండో ఉద్యోగం (పార్ట్ టైమ్/ఫుల్ టైమ్) చేయడాన్నే ‘మూన్లైటింగ్’ అంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అంశంపై దృష్టి పెట్టిన కంపెనీలు దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాయి. అనేక కంపెనీలు ‘మూన్లైటింగ్’కు పాల్పడుతున్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా దీనిపై ఇన్ఫోసిస్ కీలక సూచనలు చేసింది. తమ ఉద్యోగుల ‘మూన్లైటింగ్’కు అనుమతించింది. మేనేజర్ల అనుమతితో ‘మూన్లైటింగ్’ చేసుకోవచ్చని తెలిపింది. కానీ, ఈ విషయంలో కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం.. ‘మూన్లైటింగ్’ చేయాలంటే ఇన్ఫోసిస్ కంపెనీకి పోటీగా ఉన్న సంస్థల్లో పని చేయరాదు.
అలాగే తమ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలి. ఈ అంశంపై కంపెనీ తమ ఉద్యోగులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ గిగ్ వర్క్స్ లేదా మూన్లైటింగ్ అని మాత్రం చెప్పలేదు. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి చెందిన ఉద్యోగులు రెండో ఉద్యోగం చేస్తూ మరికొంత ఆదాయం సంపాదించుకునే వీలుంటుంది. మరోవైపు కంపెనీ నుంచి వలసలు కూడా తగ్గుతాయి.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









