మూడు నెలల్లో 10,448 వాహనాలకు నోటీసులు
- October 22, 2022
కువైట్: గడిచిన మూడు నెలల్లో శబ్దాల నిబంధనలను ఉల్లంఘించిన 10,448 వాహనాలకు నోటీసులు జారీ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు నిర్వహించిన ట్రాఫిక్ క్యాంపెయిన్ లలో నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడిన వాహనాలపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ట్రాఫిక్ చట్టం, నిబంధనలు ఉల్లంఘించేవారిని పట్టుకోవడానికి దేశవ్యాప్తంగా భద్రత, ట్రాఫిక్ ప్రచారాలు కొనసాగుతున్నాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోడ్లపై నిబంధనల ఉల్లంఘన చూసినప్పుడు ఎమర్జెన్సీ నంబర్ (112)కు కాల్ చేయాలని లేదా (965-99324092) వాట్సాప్ నెంబరుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ప్రతిఒక్కరు ట్రాఫిక్ చట్టం, నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. పౌరులు, నివాసుల భద్రత కోసం పోలీసులకు సహకరించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఙప్తి చేసింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







