నేరం జరిగిన నాలుగు గంటల్లోనే నిందితులు అరెస్ట్
- October 22, 2022
బహ్రెయిన్: నేరం చేసిన నాలుగు గంటల్లోనే బహ్రెయిన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నగదు బదిలీ కంపెనీ ఉద్యోగి నుండి BD 12,260 దొంగిలించి పరారైన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన నాలుగు గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ తెలిపింది. 58, 59 సంవత్సరాల వయస్సు గల నిందితుల నుండి దొంగిలించిన మొత్తాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగదు బదిలీ ఉద్యోగి.. కలెక్షన్ మొత్తాన్ని బ్యాంకులో జమ చేసేవాడు. ఇది గమనించిన నిందితులు.. కాపుకాసి అతడి దృష్టి మరల్చి డబ్బు ఉన్న బ్యాగును దొంగిలించి పారిపోయారు. అనంతరం బాధితుడు జరిగిన మోసాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నాలుగు గంటల్లోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని బహ్రెయిన పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







