సౌదీలో మొట్టమొదటి ఆంకాలజీ ఇ-ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభం

- October 23, 2022 , by Maagulf
సౌదీలో మొట్టమొదటి ఆంకాలజీ ఇ-ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభం

సౌదీ: ఆంకాలజీ కోసం మధ్యప్రాచ్యంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆంకాలజీ రోగులకు అందించే ఆరోగ్య నాణ్యతా సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో రియాద్‌లోని వర్చువల్ హెల్త్ హాస్పిటల్ ప్రధాన కార్యాలయంలో ఆంకాలజీ ఇ-ప్లాట్‌ఫారమ్ ప్రారంభించబడిందని పేర్కొంది. అనేక సబ్‌స్పెషల్టీలలో నైపుణ్యం కలిగిన సౌదీ వైద్యుల బృందం ప్లాట్‌ఫారమ్‌ను పర్యవేక్షిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇ-ప్లాట్‌ఫారమ్ రాజ్యంలో వెలుపల ఉన్న ఆంకాలజీ రంగంలోని నిపుణుల జ్ఞానాన్ని, అనుభవాలను మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో పనిచేస్తున్న కొందరు వైద్యులు సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ సోకిన అనేక కేసులను అధ్యయనం చేయడం ప్రారంభించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ టెలికాం కంపెనీ (ఎస్‌టిసి) భాగస్వామ్యంతో ఇ-ప్లాట్‌ఫామ్‌ సేవలను ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com