సౌదీలో మొట్టమొదటి ఆంకాలజీ ఇ-ప్లాట్ఫారమ్ ప్రారంభం
- October 23, 2022
సౌదీ: ఆంకాలజీ కోసం మధ్యప్రాచ్యంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆంకాలజీ రోగులకు అందించే ఆరోగ్య నాణ్యతా సేవలను మెరుగుపరిచే లక్ష్యంతో రియాద్లోని వర్చువల్ హెల్త్ హాస్పిటల్ ప్రధాన కార్యాలయంలో ఆంకాలజీ ఇ-ప్లాట్ఫారమ్ ప్రారంభించబడిందని పేర్కొంది. అనేక సబ్స్పెషల్టీలలో నైపుణ్యం కలిగిన సౌదీ వైద్యుల బృందం ప్లాట్ఫారమ్ను పర్యవేక్షిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇ-ప్లాట్ఫారమ్ రాజ్యంలో వెలుపల ఉన్న ఆంకాలజీ రంగంలోని నిపుణుల జ్ఞానాన్ని, అనుభవాలను మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ప్లాట్ఫారమ్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు సౌదీ అరేబియాలోని అనేక ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ సోకిన అనేక కేసులను అధ్యయనం చేయడం ప్రారంభించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ టెలికాం కంపెనీ (ఎస్టిసి) భాగస్వామ్యంతో ఇ-ప్లాట్ఫామ్ సేవలను ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!







