కొత్త నివాసిత చట్టం అక్టోబర్ నుంచి
- April 20, 2016
ఖతార్లో వలసదారులకు సంబంధించి కొత్త నివాసిత చట్టం అమల్లోకి రానుంది. అక్టోబర్ నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్న్నట్లు తెలియవస్తుంది. ఈ కొత్త చట్టం ప్రకారం ఫారిన్ వర్కర్లపై రెండేళ్ళ బ్యాన్ని తొలగించారు. అంటే ఎప్పుడైనా ఫారిన్ వర్కర్ తిరిగి ఖతార్లో అడుగుపెట్టి, కొత్త ఉద్యోగం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. కోర్టు తీర్పుల కారణంగా దేశం నుంచి పంపివేయబడ్డవారికి ఈ కొత్త చట్టం వర్తించదు. వివాదాలు ఎదుర్కొన్న వర్కర్ కోర్టులో ఫిర్యాదు చేసినప్పుడు, కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే అలాంటి వ్యక్తికీ ఈ కొత్త చట్టం వర్తించదు. కొత్త చట్టం ప్రకారం, వలస కార్మికులు తమ ఉద్యోగాల్ని ప్రభుత్వ అనుమతితో మార్చుకోవచ్చు. యజమానితో ఉన్న వివాదాల్ని పరిష్కరించుకోగలిగినవారికి ఈ కొత్త చట్టం ఎంతో ఉపయోగరంగా ఉంటుంది. అలాగే, యజమానితో సంబంధం లేకుండా, ఎగ్జిట్ పర్మిట్స్ కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ని కార్మికులు సంప్రదించవచ్చు. ఏమైనా వివాదాలుంటే, మినిస్ట్రీ వర్కర్కీ అలాగే యజమానికీ సమాచారం పంపిస్తుంది. అత్యవసర సందర్భాలలో యజమానికీ, కార్మికుడికీ మధ్య ఒప్పందం కుదిరితే వెంటనే ఎగ్జిట్ పర్మిట్ వచ్చేలా కొత్త చట్టంలో నిబంధనలున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









