వ్యక్తి చేతిలో గాయపడ్డ మహిళకు Dh20,000 పరిహారం
- October 31, 2022
అబుధాబి: ఒక మహిళపై దాడి చేసి మానసికంగా హింసించిన వ్యక్తికి కోర్టులో చుక్కెదురైంది. మానసికంగా క్షోభను అనుభవించిన మహిళకు పరిహారంగా 20,000 దిర్హామ్లు చెల్లించాలని కోర్టు సదరు వ్యక్తిని ఆదేశించింది. అంతకుముందు ఆ మహిళ ఆ వ్యక్తిపై అల్ ఐన్ సివిల్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో దావా వేసింది.తాను అనుభవించిన భౌతిక, నైతిక నష్టాలకు పరిహారంగా తనకు Dh100,000 చెల్లించాలని ఆమె డిమాండ్ చేసింది. నిందితుడు తనను తీవ్రంగా కొట్టాడని, దాని వల్ల తన నుదిటి, ఎడమ చేయి, శరీరంలోని ఇతర భాగాలకు గాయాలయ్యాయని తన వ్యాజ్యంలో పేర్కొంది. ఈ ఘటన తర్వాత తాను 20 రోజులకు పైగా పని చేయకుండా ఉండిపోయినట్లు వివరించింది. అంతకుముందు అతడిని ఇదే కేసులో క్రిమినల్ కోర్టు దోషిగా నిర్ధారించి 3,000 దిర్హామ్ల జరిమానా విధించింది. అన్ని పక్షాల నుండి విన్న తర్వాత, సివిల్ కోర్టు న్యాయమూర్తి బాధితురాలికి 20,000 దిర్హామ్లు చెల్లించాలని ప్రతివాదిని ఆదేశిస్తూ తీర్పును జారీ చేశారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!
- దమ్మామ్ నుండి కార్యకలాపాలను పొడిగించిన గల్ఫ్ ఎయిర్..!!
- అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో ఖతార్ ప్రధాన మంత్రి భేటీ..!!
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి









