అబుధాబి BAPS హిందూ మందిర్ లో ఘనంగా దీపావళి వేడుకలు
- October 31, 2022
అబుధాబి: BAPS హిందూ మందిర్లో వరుసగా మూడవ సంవత్సరం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 10,000 మంది సందర్శకులు హాజరయ్యారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన వేడుకలు రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి. యూఏఈ టోలరెన్స్, కోఎగ్జిటెన్స్ మినిస్టర్ షేక్ నహ్యాన్ మబారక్ అల్ నహ్యాన్ సహా వందలాది మంది ప్రముఖులు ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారని ఈ సందర్భంగా BAPS మిడిల్ ఈస్ట్ అధిపతి పూజ్య బ్రహ్మవిహారి స్వామి వివరించారు. ఈ కార్యక్రమానికి యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే రాయబారి జోస్ అగ్యురో అవిలా తదితరలు హాజరయ్యారు.



తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









