అబుధాబి BAPS హిందూ మందిర్ లో ఘనంగా దీపావళి వేడుకలు
- October 31, 2022
అబుధాబి: BAPS హిందూ మందిర్లో వరుసగా మూడవ సంవత్సరం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దాదాపు 10,000 మంది సందర్శకులు హాజరయ్యారు. ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన వేడుకలు రోజంతా ఆహ్లాదకర వాతావరణంలో కొనసాగాయి. యూఏఈ టోలరెన్స్, కోఎగ్జిటెన్స్ మినిస్టర్ షేక్ నహ్యాన్ మబారక్ అల్ నహ్యాన్ సహా వందలాది మంది ప్రముఖులు ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారని ఈ సందర్భంగా BAPS మిడిల్ ఈస్ట్ అధిపతి పూజ్య బ్రహ్మవిహారి స్వామి వివరించారు. ఈ కార్యక్రమానికి యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈలోని రిపబ్లిక్ ఆఫ్ పరాగ్వే రాయబారి జోస్ అగ్యురో అవిలా తదితరలు హాజరయ్యారు.



తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







