2,000 నకిలీ వేలిముద్రలతో దోపిడీ.. ఏడుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- October 31, 2022
రియాద్: 2,000 మంది వ్యక్తుల వేలిముద్రలను అక్రమ మార్గాల్లో సేకరించి.. వాటితో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఒక సౌదీ పౌరుడు, ఆరుగురు ఆసియా జాతీయులతో సహా ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ ముఠా వ్యక్తుల వేలిముద్రలను పొందడంతోపాటు వారికి తెలియకుండానే వారి పేర్లపై సిమ్కార్డులను తీసుకుంటుందన్నారు. అనంతరం ఆయా వ్యక్తులను సంప్రదించి, ఆర్థిక సంస్థల ప్రతినిధులమని నమ్మించేవారు. బాధితుల వేలిముద్రలను దుర్వినియోగం చేయడం ద్వారా వారి ఫోన్ నంబర్లకు వచ్చిన OTP లను ముఠా సభ్యులు తెలుసుకుంటున్నారు. తద్వారా వారి రహస్య డేటాను యాక్సెస్ చేసి వారి ఖాతాల నుండి డబ్బును ముఠా దొంగిలించేది. బాధితుల ఫిర్యాదుతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆధ్వర్యంలోని ఆర్థిక నేరాల విభాగం ముఠా మోసపూరిత పద్ధతులపై దృష్టి సారించింది. మోసాలకు పాల్పడేందుకు వీలుగా ముఠాలోని సౌదీ పౌరుడు టెలికమ్యూనికేషన్స్ రంగంలో వాణిజ్యపరమైన రిజిస్ట్రేషన్ను పొందినట్లు పరిశోధనల్లో గుర్తించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికి సంబంధించి అటార్నీ జనరల్ జారీ చేసిన ఆదేశాల మేరకు ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









