విజయవాడ-షార్జాకు విమాన సర్వీస్ ప్రారంభం...
- November 01, 2022
విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుంచి షార్జాకు బయల్దేరిన మొదటి ఎయిర్ ఇండియా విమానానికి విశేష స్పందన లభించింది.సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు షార్జా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణమైంది.50 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం 122 మందితో తిరుగు ప్రయాణమైంది.ఈ విమానానికి విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్రెడ్డి ఘన స్వాగతం పలికారు.మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని నాని జెండా ఊపారు.అనంతరం ప్రయాణికులకు బోర్డింగ్ పాస్లు ఇచ్చారు.ఈ అంతర్జాతీయ విమానం వారంలో రెండు రోజులు సోమ, శనివారాల్లో రాకపోకలు సాగిస్తుంది. విమాన సర్వీసు ప్రారంభించటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ అంతర్జాతీయ సర్వీసు ద్వారా గల్ఫ్ దేశాలకు విజయవాడ నుంచి కనెక్టివిటీ ఏర్పడింది.దుబాయ్, అబుధాబి, రస్ ఆల్ఖైమా వంటి ఎమిరేట్లకు మరియు అరబ్ దేశాలకు చేరుకునే వీలు కలిగింది.
విజయవాడ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభించటానికి ఎంతో కృషి చేశాం.సర్వీసు ప్రారంభం కావటం ఆనందంగా ఉంది.ప్రస్తుతం వారంలో రెండు రోజుల పాటు నడుస్తుంది.ఆక్యుపెన్సీ పెరిగితే డైలీ నడుపుతాం.ఇప్పటికే విజయవాడ నుంచి మస్కట్కు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభించాం.విజయవాడకు కువైట్ నుంచి మరో రెండు వన్వే విమానాలు నడుస్తున్నాయి.రానున్న రోజుల్లో బ్యాంకాక్, మలేషియా, సింగపూర్కు కూడా నడుపుతాం.-వల్లభనేని బాలశౌరి, మచిలీపట్నం ఎంపీ
షార్జాకు అంతర్జాతీయ సర్వీసు ప్రారంభం కావటం ఆనందంగా ఉంది.2014కు ముందు ఈ ఎయిర్పోర్టు బస్టాండ్ కంటే తక్కువగా ఉండేది.గత ముఖ్యమంత్రి చంద్రబాబు,కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు హయాంలో అభివృద్ధి చెందింది.విమానాశ్రయం అభివృద్ధి కోసం 700 ఎకరాల భూములను సేకరించి అప్పగించాం.టీడీపీ ఆధ్వర్యంలో విమానాశ్రయం భూముల కోసం రూ.2,400 కోట్లు ఖర్చు చేశాం.ఎయిర్పోర్టు అభివృద్ధి కోసం మరో రూ.1,000 కోట్లు ఖర్చు చేశాం.రూ.130 కోట్లతో పాత టెర్మినల్ను అంతర్జాతీయ టెర్మినల్గా అభివృద్ధి చేశాం. టాటా కుటుంబంతో ఉన్న సత్సంబంధాల కారణంగా విజయవాడకు మరిన్ని సర్వీసులు తీసుకురావటానికి కృషి చేస్తా.-కేశినేని శ్రీనివాస్, విజయవాడ ఎంపీ
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







