మొన్న తమన్నా, ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్.!
- November 01, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజై, మంచి విజయం అందుకుంది. ఓటీటీ ప్రేక్షకుల్ని ఈ సినిమా కథ, కథనం బాగా ఆకట్టుకున్నాయ్.
తమన్నా తన నటనతో ఓటీటీ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఓటీటీలో మంచి క్లీన్ అండ్ ఎంటర్టైనర్ మూవీగా ‘బబ్లీ బౌన్సర్’ గుర్తింపు దక్కించుకుంది. మాధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈయనే మరో సినిమా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా కోసం ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ని లీడ్ రోల్గా ఎంచుకున్నారాయన.
‘లాక్డౌన్’ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. లాక్డౌన్ ఎంతో మంది బతుకుల్ని ఛిద్రం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి కొన్ని హార్ట్ టచ్చింగ్ క్యారెక్టర్లను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు మాధుర్ భండార్కర్.
శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాలో వేస్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే శ్వేతా బసు ప్రసాద్ పలు ఓటీటీ కంటెంట్లతో దూసుకెళుతోంది. యాక్టింగ్ స్కోపున్న రోల్స్తో ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, కెరీర్ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటోంది. మరి, తాజా మూవీ ‘లాక్డౌన్’ శ్వేతా బసు ప్రసాద్కి ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!







