మొన్న తమన్నా, ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్.!
- November 01, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో రిలీజై, మంచి విజయం అందుకుంది. ఓటీటీ ప్రేక్షకుల్ని ఈ సినిమా కథ, కథనం బాగా ఆకట్టుకున్నాయ్.
తమన్నా తన నటనతో ఓటీటీ ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. ఓటీటీలో మంచి క్లీన్ అండ్ ఎంటర్టైనర్ మూవీగా ‘బబ్లీ బౌన్సర్’ గుర్తింపు దక్కించుకుంది. మాధుర్ భండార్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఈయనే మరో సినిమా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమా కోసం ‘కొత్త బంగారు లోకం’ ఫేమ్ శ్వేతా బసు ప్రసాద్ని లీడ్ రోల్గా ఎంచుకున్నారాయన.
‘లాక్డౌన్’ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. లాక్డౌన్ ఎంతో మంది బతుకుల్ని ఛిద్రం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి కొన్ని హార్ట్ టచ్చింగ్ క్యారెక్టర్లను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు మాధుర్ భండార్కర్.
శ్వేతా బసు ప్రసాద్ ఈ సినిమాలో వేస్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే శ్వేతా బసు ప్రసాద్ పలు ఓటీటీ కంటెంట్లతో దూసుకెళుతోంది. యాక్టింగ్ స్కోపున్న రోల్స్తో ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ రోల్స్, వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ, కెరీర్ని ప్రత్యేకంగా డిజైన్ చేసుకుంటోంది. మరి, తాజా మూవీ ‘లాక్డౌన్’ శ్వేతా బసు ప్రసాద్కి ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!









