ఇండియాలో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన: బాధితులకు సౌదీ నేతల సంతాపం
- November 02, 2022
రియాద్: పశ్చిమ భారతదేశంలోని గుజరాత్లో కేబుల్ వంతెన కూలి కనీసం 135 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో బాధితులకు సౌదీ అరేబియా రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ మేరకు భారత అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు ఓ లేఖను పంపారు.
దీపావళి లేదా ఛత్ పూజ సెలవుల నేపథ్యంలో వందలాది మంది సందర్శకులు ఆదివారం సాయంత్రం 230 మీటర్ల పొడవైన కేబుల్ వంతెనపై నిలబడి ఆస్వాదిస్తుండగా.. అది కూలి సందర్శకులు మచ్చు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 135 మంది చనిపోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులే అధికంగా ఉన్నారు.
గుజరాత్లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్కు 200 కి.మీ దూరంలో ఉన్న మోర్బీలోని ఈ కేబుల్ వంతెనను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో నిర్మించారు. ఇటీవల ఈ కేబుల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి సందర్శకుల కోసం తెరిచారు. ఇది తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నాలుగు రోజులకే కుప్పకూలింది.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







