ఇండియాలో కేబుల్ బ్రిడ్జి దుర్ఘటన: బాధితులకు సౌదీ నేతల సంతాపం
- November 02, 2022
రియాద్: పశ్చిమ భారతదేశంలోని గుజరాత్లో కేబుల్ వంతెన కూలి కనీసం 135 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో బాధితులకు సౌదీ అరేబియా రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ లు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ మేరకు భారత అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు ఓ లేఖను పంపారు.
దీపావళి లేదా ఛత్ పూజ సెలవుల నేపథ్యంలో వందలాది మంది సందర్శకులు ఆదివారం సాయంత్రం 230 మీటర్ల పొడవైన కేబుల్ వంతెనపై నిలబడి ఆస్వాదిస్తుండగా.. అది కూలి సందర్శకులు మచ్చు నదిలో పడిపోయారు. ఈ ఘటనలో 135 మంది చనిపోయారు. ఇందులో మహిళలు, చిన్నారులు, వృద్ధులే అధికంగా ఉన్నారు.
గుజరాత్లోని ప్రధాన నగరమైన అహ్మదాబాద్కు 200 కి.మీ దూరంలో ఉన్న మోర్బీలోని ఈ కేబుల్ వంతెనను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో నిర్మించారు. ఇటీవల ఈ కేబుల్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులను పూర్తి చేసి సందర్శకుల కోసం తెరిచారు. ఇది తిరిగి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నాలుగు రోజులకే కుప్పకూలింది.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







