బహ్రెయిన్ పబ్లిక్ బస్ నెట్వర్క్ విస్తరణ
- November 02, 2022
బహ్రెయిన్: నవంబర్ 6 నుండి బహ్రెయిన్లోని అన్ని ప్రాంతాలకు సేవలందించేందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ నెట్వర్క్ ని విస్తరించి.. కొత్త లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముహరక్ గవర్నరేట్, ఇసా టౌన్, సల్మాన్ సిటీ, బుదయ్యా, సార్లోని అన్ని పట్టణాలతోపాటు అదనంగా మనామా, సిత్రా, రిఫా, సదరన్ గవర్నరేట్ కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కవరేజీలు కొత్త ప్రణాళికలో భాగంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్ అండ్ స్టడీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ హుస్సేన్ అలీ యాకూబ్ మాట్లాడుతూ.. బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ సమన్వయంతో వినియోగదారుల ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రజా రవాణా సేవలను అందించడానికి మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని కల్పించుందకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు, మహిళలకు ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేశామన్నారు.
తాజా వార్తలు
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!









