11 మంది వ్యక్తులకు 65 సంవత్సరాల జైలు శిక్ష, SR 29 మిలియన్ల జరిమానా
- November 03, 2022
రియాద్: ప్రజా సంపదను అపహరించినందుకు మొత్తం 11 మంది వ్యక్తులకు మొత్తం 65 సంవత్సరాల జైలు శిక్ష, SR 29 మిలియన్ల జరిమానా విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 11 మంది వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడి ప్రజాధనాన్ని అపహరించారు. ప్రభుత్వ డీజిల్ను దొంగిలించి అక్రమంగా తరలించి విదేశాల్లో విక్రయిస్తున్నారని దర్యాప్తులో తేలింది. ఈ ముఠా మనీలాండరింగ్, ఫోర్జరీ, బ్యాంకింగ్ మానిటరింగ్ సిస్టమ్ను ఉల్లంఘించడం వంటి అనేక ఇతర నేరాలకు పాల్పడింది. నిందితులను అరెస్టు చేసి, విచారణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత కోర్టు తీర్పును వెలువరించింది. నేరంలో ఉపయోగించిన వస్తువులు, ఆస్తులు, అక్రమ లావాదేవీల ద్వారా సేకరించిన ఆదాయాన్ని జప్తు చేయాలని కోర్టు తీర్పు చెప్పింది. దోషులుగా నిర్ధారించబడిన వాణిజ్య సంస్థలు ప్రభుత్వ అధికారులతో ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిషేధించింది. నేరస్థులకు చెందిన గ్యాస్ స్టేషన్ల లైసెన్స్లను రద్దు చేసింది. నేరానికి పాల్పడిన ప్రవాసులను శిక్షాకాలం ముగిసిన తర్వాత బహిష్కరించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









