వాహనాల వద్ద కొవిడ్-19 పరీక్షలు నిలిపివేత
- November 03, 2022
దోహా: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) తన ఆరోగ్య కేంద్రాలైన లీబైబ్, అల్ గరాఫా, అల్ రేయాన్, అల్ వాజ్బా, అల్ వక్రాలలో 2022 నవంబర్ 1 నుండి వాహనాల నుండి కొవిడ్-19 పరీక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కేబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు పీహెచ్సీసీ తెలిపింది. కొవిడ్-19కి వ్యతిరేకంగా జాతీయ టీకా కార్యక్రమాన్ని నిరంతరం అమలు చేయడంతో పాటు ఖతార్తో సహా ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 ఇన్ఫెక్షన్ కేసుల తగ్గింపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెల్త్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఖతార్ రాష్ట్రానికి చేరుకున్న తర్వాత పౌరులు, నివాసితుల కోసం వేగవంతమైన యాంటిజెన్ పరీక్ష లేదా పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షలను రద్దు చేస్తూ అక్టోబర్ 26 ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







