గడువు ముగిసిన వస్తువుల విక్రయం.. వాణిజ్య సంస్థ సీజ్
- November 06, 2022
మస్కట్ : గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్న ఓ వాణిజ్య సంస్థను ముసండంలోని ఖాసబ్లోని వినియోగదారుల రక్షణ విభాగం సీజ్ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం అమలును పర్యవేక్షించేందుకు నిరంతరం తనిఖీ డ్రైవ్లను కొనసాగిస్తామని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీపీఏ) ప్రకటించింది. ఇందులో భాగంగానే ఖాసబ్లోని ఓ వాణిజ్య సంస్థలో గడువు ముగిసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గడువు ముగిసిన వస్తువులను విక్రయించిన వాణిజ్య సంస్థపై జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. మార్కెట్లలో గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నా.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన విషయాలను గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా తెలపాలని వినియోగదారులకు సీపీఏ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- ఇంద్రకీలాద్రి వసంతోత్సవాలకు పోటెత్తిన భక్తులు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!









