నకిలీ నోట్ల ముద్రణ కేసులో ఆరుగురి అరెస్ట్
- November 08, 2022
జెడ్డా: నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో ఇద్దరు పౌరులతో సహా నలుగురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది. ఈ ముఠా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. విచారణ కోసం కోర్టుకు వారిని రిఫర్ చేయనున్నట్లు తెలిపింది. నోట్లను ముద్రించేందుకు నిందితులు ఎలక్ట్రానిక్ మెషిన్లను ఉపయోగించినట్లు విచారణలో వెల్లడైందని వివరించింది. నకిలీ నోట్ల ముద్రణ, చెలామణి కేసులో శిక్షా విధానంలోని ఆర్టికల్ టూ ప్రకారం.. నేరస్థులకు 25 సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR500,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!
- 1,800 కు పైగా ఈ-కామర్స్ ఫిర్యాదులకు మోక్షం..!!
- గాజాపై చర్చించిన సౌదీ, యుకె విదేశాంగ మంత్రులు..!!
- వెస్టిండీస్ సిరీస్ కు టీం ఇండియా జట్టు ఇదే!