పాఠశాల బస్సుల్లో విద్యార్థులు మాస్కులు పెట్టుకోవాలా?
- November 08, 2022
యూఏఈ: కొవిడ్-19 ఆంక్షలను యూఏఈ ఎత్తివేసింది. అయితే, విద్యార్థులు ఇకపై బస్సుల్లో పాఠశాలలకు వెళ్లేటప్పుడు మాస్క్లు ధరించాల్సిన అవసరం ఉందా. దీనిపై అటు పేరెంట్స్, ఇటు స్కూల్స్ యాజమాన్యాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. కోవిడ్ -19 పరిమితులను ఎత్తివేసిన తర్వాత.. అన్ని ఓపెన్, క్లోజ్డ్ సౌకర్యాలలో మాస్కులు ధరించడం ఆప్షనల్ గా మారింది. ఈ నిర్ణయాన్ని పాఠశాలల సంఘాలు స్వాగతిస్తున్నాయి.
అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ముందుజాగ్రత్త చర్యగా, పాఠశాల బస్సులో ప్రయాణించేటప్పుడు విద్యార్థులు మాస్క్ ధరించమని చెబుతున్నట్లు పేర్కొన్నారు. తమ విద్యార్థులలో ఎక్కువ మంది తరగతి గదిలో మాస్క్ ధరించరు. అయినప్పటికీ, మూసి ఉన్న ప్రదేశాలలో మాస్కు ధరించాలని సూచిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.
క్రెడెన్స్ హైస్కూల్ సీఈఓ- ప్రిన్సిపల్ దీపికా థాపర్ సింగ్ మాట్లాడుతూ.. స్కూల్ బస్సులలో ప్రయాణించేటప్పుడు తమ విద్యార్థులు, సిబ్బంది ఇకపై మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఎవరైనా మాస్క్ ధరించాలని అనుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఒక పిల్లవాడు జలుబు/దగ్గుతో బాధపడుతుంటే, అందరి భద్రత కోసం మాస్క్ ధరించాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!