మా హృదయ, గవాక్షాలు తెరిచే ఉంటాయి
- June 17, 2015
బహ్రైన్ ప్రధానమంత్రి రాయల్ హైనెస్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, షేక్ మొహమ్మద్ సయాద్ సలేహ్ అల్ అరబీ నాయకత్వంలోని పండితులను, మతపెద్దలను ఆహ్వానిస్తూ, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించి, పరాయివారిని తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొనీయని తమ బహ్రైన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాలవారిని ఏకం చేసి, జాతీయ ఐక్యతను పెంపొందించడానికి తమ హృదయాలు, ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.
తమ ప్రజలు సంఘీభావానికి పేరు పొందిన వారని, వారిలో ఈ విధంగా ఐకమత్యాన్ని పెంపొందించడంలో మత పెద్దలు, పండితులు బోధించిన స్నేహం, సౌభ్రాతృత్వం, సహనం అనే గుణాలు ప్రజలను పూలలో దారంలా సుస్థిరంగా ఉంచాయన్నారు.
విచ్చేసిన మతపెద్దలు, తమ ప్రభువు యొక్క జ్ఞానాన్ని, దూరదృష్టిని, విశాల దృక్పధాన్ని, అందరినీ సమ దృష్టితో చూసే సరళీకృత విధానాలను మానస్ఫూర్తిగా ప్రశంసించారు. తమ అధినేత విధానాలు అన్ని కష్టాలకు ఔషధ లేపనం వంటిదనీ, అవి అన్ని సామాజిక వర్గాలను ఏకీకృతం చేసాయనీ, తన ప్రజల విజ్ఞాపనలను, అభిప్రాయాలను గౌరవించే తమ రాజు గారి ఔన్నత్యాన్ని వేనోళ్ల కొనియాడారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









