ఐదు దుకాణాల్లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

- November 08, 2022 , by Maagulf
ఐదు దుకాణాల్లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

మస్కట్: ముసందమ్ గవర్నరేట్‌లోని ఐదు దుకాణాలలో దొంగతనం చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. ఐదు దుకాణాల నుండి డబ్బు, మెడికల్, వ్యక్తిగత ఉపకరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఒక వ్యక్తిని ముసండం గవర్నరేట్ పోలీస్ కమాండ్ అరెస్టు చేసిందని ఆర్వోపీ వెల్లడించింది.  అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. షాపుల యజమానులు, వాణిజ్య సంస్థలు పర్యవేక్షణ, అలారం పరికరాలను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, వారి ఆస్తులను భద్రపరచడానికి నివారణ చర్యలు చేపట్టాలని  రాయల్ ఒమన్ పోలీసులు  పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com