దుబాయ్ లో ఘనంగా గురునానక్ 553వ జయంతి వేడుకలు
- November 09, 2022
దుబాయ్: సిక్కు మత స్థాపకుడు.. 10 మంది గురువులలో మొదటి వ్యక్తి అయిన గురునానక్ దేవ్జీ 553వ జయంతిని నవంబర్ 8న జెబెల్ అలీలోని సిక్కు దేవాలయం గురునానక్ దర్బార్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలలు నిర్వహించారు.రోజంతా లంగర్ (భోజనాలు) వడ్డించారు. ప్రముఖ రాగి జాతా భాయ్ హర్జిందర్ సింగ్ శ్రీనగర్వాలే, వీర్ మన్ప్రీత్ సింగ్ జీ, అనేక ఇతర ప్రముఖ సిక్కు మత గాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి, చండీగఢ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ సత్నామ్ సింగ్ సంధు, ఛాన్సలర్ హిమానీ సూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ కంధారి మాట్లాడుతూ.. గురునానక్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న అబుదాబిలోని ఇండియా సోషల్ & కల్చరల్ సెంటర్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2.30 వరకు ప్యాక్డ్ లాంగర్ తోపాటు నవంబర్ 13న ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు గురునానక్ దర్బార్ జెబెల్ అలీ దుబాయ్లో గురుపురబ్ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు