దుబాయ్ లో ఘనంగా గురునానక్ 553వ జయంతి వేడుకలు
- November 09, 2022
దుబాయ్: సిక్కు మత స్థాపకుడు.. 10 మంది గురువులలో మొదటి వ్యక్తి అయిన గురునానక్ దేవ్జీ 553వ జయంతిని నవంబర్ 8న జెబెల్ అలీలోని సిక్కు దేవాలయం గురునానక్ దర్బార్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలలు నిర్వహించారు.రోజంతా లంగర్ (భోజనాలు) వడ్డించారు. ప్రముఖ రాగి జాతా భాయ్ హర్జిందర్ సింగ్ శ్రీనగర్వాలే, వీర్ మన్ప్రీత్ సింగ్ జీ, అనేక ఇతర ప్రముఖ సిక్కు మత గాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి, చండీగఢ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ సత్నామ్ సింగ్ సంధు, ఛాన్సలర్ హిమానీ సూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ కంధారి మాట్లాడుతూ.. గురునానక్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న అబుదాబిలోని ఇండియా సోషల్ & కల్చరల్ సెంటర్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2.30 వరకు ప్యాక్డ్ లాంగర్ తోపాటు నవంబర్ 13న ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు గురునానక్ దర్బార్ జెబెల్ అలీ దుబాయ్లో గురుపురబ్ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు.




తాజా వార్తలు
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్లో వ్యక్తికి జైలుశిక్ష..!!









