దుబాయ్ లో ఘనంగా గురునానక్ 553వ జయంతి వేడుకలు
- November 09, 2022
దుబాయ్: సిక్కు మత స్థాపకుడు.. 10 మంది గురువులలో మొదటి వ్యక్తి అయిన గురునానక్ దేవ్జీ 553వ జయంతిని నవంబర్ 8న జెబెల్ అలీలోని సిక్కు దేవాలయం గురునానక్ దర్బార్లో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలలు నిర్వహించారు.రోజంతా లంగర్ (భోజనాలు) వడ్డించారు. ప్రముఖ రాగి జాతా భాయ్ హర్జిందర్ సింగ్ శ్రీనగర్వాలే, వీర్ మన్ప్రీత్ సింగ్ జీ, అనేక ఇతర ప్రముఖ సిక్కు మత గాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి, చండీగఢ్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ సత్నామ్ సింగ్ సంధు, ఛాన్సలర్ హిమానీ సూద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేందర్ కంధారి మాట్లాడుతూ.. గురునానక్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న అబుదాబిలోని ఇండియా సోషల్ & కల్చరల్ సెంటర్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2.30 వరకు ప్యాక్డ్ లాంగర్ తోపాటు నవంబర్ 13న ఉదయం 4.30 నుండి రాత్రి 9 గంటల వరకు గురునానక్ దర్బార్ జెబెల్ అలీ దుబాయ్లో గురుపురబ్ వేడుకలు కొనసాగుతాయని తెలిపారు.




తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







