మిల్క్ టాఫీలలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్

- November 09, 2022 , by Maagulf
మిల్క్ టాఫీలలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్

ఒమన్: ఒమన్ నుంచి ఎక్లెయిర్స్ టాఫీలలో దాచి అక్రమంగా తరలిస్తున్న బంగారం పేస్ట్‌ను భారత కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకున్నది. ఒమన్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర ఎక్లెయిర్స్ మిల్క్ టాఫీలలో దాచిన గోల్డ్ పేస్ట్‌ను కనుగొన్నట్లు భారత కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 18 ఎక్లెయిర్ మిల్క్ టాఫీలలో దాచిన 355 గ్రాముల గోల్డ్ పేస్ట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల షార్జా నుండి ఢిల్లీకి ప్రయాణించిన ముగ్గురు ప్రయాణికుల నుండి 7,000 గ్రాముల బంగారాన్ని భారత కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com