సౌదీ జాతీయ క్రీడల్లో మెరిసిన తెలుగువాసికి ఘన సన్మానం
- November 10, 2022
సౌదీ: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మహాద్ షా, కేరళకు చెందిన ఖదీజాలను సౌదీలోని భారత ఎంబసీ ఘనంగా సన్మానించింది. మహాద్ షా, ఖదీజాలు సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగాల్లో ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్స్, చెరో రూ.2.18 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వీరి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం వీరిద్దరిని ఘనంగా సన్మానించింది. రియాద్లోని భారతీయ ఎంబసీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో తాత్కాలిక రాయబారి ఎన్.రాంప్రసాద్ విజేతలకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ ఎంబసీ అధికారులు, విజేతల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









