వ్యాపారవేత్త, అతని భార్య హత్య కేసులో కార్మికుడికి మరణశిక్ష ఖరారు
- November 12, 2022
యూఏఈ: 2020లో అరేబియా రాంచెస్లో భారతీయ జంటను హత్య చేసిన నిర్మాణ కార్మికుడికి విధించిన మరణశిక్షను దుబాయ్లోని అప్పీల్ కోర్టు సమర్థించింది. నిందితుడు అరేబియా రాంచెస్లోని మిరాడోర్ జిల్లాలోని ఇంట్లోకి చొరబడి గ్రౌండ్ ఫ్లోర్లోని వాలెట్ నుండి Dh1,965 దొంగిలించాడని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాపారవేత్తను, అతడి భార్యను దారుణంగా హత్య చేశాడు. తిరిగి వెళ్లే సమయంలో తనను చూసిందని 18 ఏళ్ల వ్యాపారవేత్త కూతురి మెడపై కత్తితో దాడి చేయగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న దర్యాప్తు అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు ఘటనకు కొన్ని నెలల ముందు వ్యాపారవేత్త విల్లాలో ఉద్యోగం చేసి మానేసిన కార్మికుడిగా నిర్ధారించారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించబడింది. తాజాగా ఆ తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







