వ్యాపారవేత్త, అతని భార్య హత్య కేసులో కార్మికుడికి మరణశిక్ష ఖరారు
- November 12, 2022
యూఏఈ: 2020లో అరేబియా రాంచెస్లో భారతీయ జంటను హత్య చేసిన నిర్మాణ కార్మికుడికి విధించిన మరణశిక్షను దుబాయ్లోని అప్పీల్ కోర్టు సమర్థించింది. నిందితుడు అరేబియా రాంచెస్లోని మిరాడోర్ జిల్లాలోని ఇంట్లోకి చొరబడి గ్రౌండ్ ఫ్లోర్లోని వాలెట్ నుండి Dh1,965 దొంగిలించాడని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాపారవేత్తను, అతడి భార్యను దారుణంగా హత్య చేశాడు. తిరిగి వెళ్లే సమయంలో తనను చూసిందని 18 ఏళ్ల వ్యాపారవేత్త కూతురి మెడపై కత్తితో దాడి చేయగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న దర్యాప్తు అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు ఘటనకు కొన్ని నెలల ముందు వ్యాపారవేత్త విల్లాలో ఉద్యోగం చేసి మానేసిన కార్మికుడిగా నిర్ధారించారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించబడింది. తాజాగా ఆ తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







