వ్యాపారవేత్త, అతని భార్య హత్య కేసులో కార్మికుడికి మరణశిక్ష ఖరారు

- November 12, 2022 , by Maagulf
వ్యాపారవేత్త, అతని భార్య హత్య కేసులో కార్మికుడికి మరణశిక్ష ఖరారు

యూఏఈ: 2020లో అరేబియా రాంచెస్‌లో భారతీయ జంటను హత్య చేసిన నిర్మాణ కార్మికుడికి విధించిన మరణశిక్షను దుబాయ్‌లోని అప్పీల్ కోర్టు సమర్థించింది. నిందితుడు అరేబియా రాంచెస్‌లోని మిరాడోర్ జిల్లాలోని ఇంట్లోకి చొరబడి గ్రౌండ్ ఫ్లోర్‌లోని వాలెట్ నుండి Dh1,965 దొంగిలించాడని కోర్టు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యాపారవేత్తను, అతడి భార్యను దారుణంగా హత్య చేశాడు. తిరిగి వెళ్లే సమయంలో తనను చూసిందని 18 ఏళ్ల వ్యాపారవేత్త కూతురి మెడపై కత్తితో దాడి చేయగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న దర్యాప్తు అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలను సేకరించారు. నిందితుడు ఘటనకు కొన్ని నెలల ముందు వ్యాపారవేత్త విల్లాలో ఉద్యోగం చేసి మానేసిన కార్మికుడిగా నిర్ధారించారు. విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు అతనికి మరణశిక్ష విధించబడింది. తాజాగా ఆ తీర్పును అప్పీల్ కోర్టు సమర్థించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com