అలెప్పో పరిసర ప్రాంతాల్లో యుద్ధ విమానాలు బాంబుల వర్షం..
- April 22, 2016
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆధీనంలోకి తీసుకున్న అలెప్పో నగరం, పరిసర ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 9 మంది పౌరులు మృతిచెందగా, డజన్ల మంది గాయాలపాలైనట్లు స్థానిక పౌరరక్షణ అధికారులు వెల్లడించారు. సిరియాలోని బ్రిటన్కు చెందిన మానవ హక్కుల పరిరక్షణ సంస్థ మాత్రం పది మంది పౌరులు మరణించినట్లు తెలిపింది.అలెప్పో పరిసర ప్రాంతాల్లో బస్టన్ అల్-ఖసర్, అల్-మషద్ జిల్లాలో యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మానవ హక్కుల సంస్థ పేర్కొంది. సిరియాలో గత కొన్నేళ్లుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని అరాచకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









