దొంగిలించిన కారుతో రైడ్.. Dh508,000 ట్రాఫిక్ జరిమానాలు
- November 12, 2022
యూఏఈ: అబుధాబిలో ఒక యువకుడు తన కారును దొంగిలించాడని, దానితో Dh508,000 విలువైన ఉల్లంఘనలకు పాల్పడ్డాడని.. ఓ మహిళ సదరు యువకుడిపై అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ క్లెయిమ్స్ కోర్టులో సివిల్ దావా వేసింది. తన పేరుపై నమోదైన ట్రాఫిక్ జరిమానాలను క్లియర్ చేయాలని లేదా నిందితుడి ఖాతాకు బదిలీ చేయాలని తన దావాలో కోరింది. కేసును విచారించిన అబుధాబి క్రిమినల్ కోర్టు చోరీకి పాల్పడినట్లు తేలిన తరువాత యువకుడికి ఏడాది జైలు శిక్ష విధించింది. మహిళ కారును ఉపయోగించి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కారణమైనందుకు 500 దిర్హామ్లు జరిమానా విధించింది. కానీ, సదరు మహిళ దావాకు సంబంధించి కోర్టు రుసుమును చెల్లించలేదని గుర్తించింది. కోర్టు ఫీజు చెల్లించనందుకు కేసును తిరస్కరించినట్లు కోర్టు తన తీర్పులో పేర్కొంది. అలాగే నిందితుడికి న్యాయపరమైన ఖర్చులు చెల్లించాలని మహిళను ఆదేశించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!