తిరుమల భక్తులకు షాక్..
- November 13, 2022తిరుమల: తిరుమల వెళ్లే భక్తులకు షాక్ ఇచ్చింది. ఆర్జిత సేవలు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. తిరుమలలో ఇవాళ నిర్వహించవలసిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రద్దు చేసిన టీటీడీ.. వర్షం కారణంగా పార్వేటి మండపం వద్ద నిర్వహించవలసిన కార్యక్రమాన్ని రద్దు చేసింది. దీంతో వైభవోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.
అలాగే, ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి. ఇది ఇలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 73,323 మంది భక్తులు దర్శించుకున్నారు. 41,041 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ.3.2 కోట్లుగా నమోదు అయింది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం