బహ్రెయిన్ లో ‘స్టడీ ఇన్ ఇండియా’: హాజరైన 16 ప్రసిద్ధ భారత విశ్వవిద్యాలయాలు
- November 13, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లోని ఇండియన్ క్లబ్లో టీఐఈఎస్ (TIES) ఇండియాతో పాటు యూనిగ్రాడ్(UniGrad) ఎడ్యుకేషన్ సెంటర్ నిర్వహించిన ‘స్టడీ ఇన్ ఇండియా కౌన్సెలింగ్ మీట్ 2022' ముగిసింది. ఇందులో వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), బిట్స్ పిలానీ, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా భారతదేశంలోని 16 ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. ఈ ‘స్టడీ ఇన్ ఇండియా’ సమావేశాన్ని నవంబర్ 11న బహ్రెయిన్లోని భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ ప్రారంభించారు. ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసిన తర్వాత భారతదేశంలోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల నుండి నాణ్యమైన విద్యనభ్యసించేందుకు చూస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థుల నుండి అధిక స్పందన వచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్న విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ విభాగం అధిపతులు ఇంజనీరింగ్, మెడికల్, హెల్త్కేర్, మేనేజ్మెంట్, కామర్స్, లిబరల్ ఆర్ట్స్ కోర్సుల గురించి వివరించారు. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, అవి అందిస్తున్న కోర్సులు తదితర సమాచారం పొందడానికి.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు 32332746 లేదా 17344972లో సంప్రదించవచ్చని యూనిగ్రాడ్(UniGrad) వెల్లడించింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









