9 ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి రిటైలర్లకు అనుమతి లేదు
- November 14, 2022
యూఏఈ: ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా రిటైలర్లు తొమ్మిది ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి అనుమతి లేదు. దీనికి సంబంధించిన ప్రాథమిక వినియోగ వస్తువుల కోసం కొత్త ధరల విధానాన్నియూఏఈ కేబినెట్ తాజాగా ఆమోదించింది. ప్రాథమిక నిత్యావసరాల ధరలను నిర్ణయించడంలో విక్రయ కేంద్రాల నిబద్ధతను మంత్రిత్వ శాఖ నిర్ధారిస్తుంది. వంట నూనెలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ప్రాథమిక జాబితాలో ఉన్నాయి.వీటి ధరలను మార్చాలంటే రిటైలర్లు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో, ప్రాథమిక ఆహార పదార్థాల ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!









