9 ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి రిటైలర్లకు అనుమతి లేదు
- November 14, 2022
యూఏఈ: ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా రిటైలర్లు తొమ్మిది ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి అనుమతి లేదు. దీనికి సంబంధించిన ప్రాథమిక వినియోగ వస్తువుల కోసం కొత్త ధరల విధానాన్నియూఏఈ కేబినెట్ తాజాగా ఆమోదించింది. ప్రాథమిక నిత్యావసరాల ధరలను నిర్ణయించడంలో విక్రయ కేంద్రాల నిబద్ధతను మంత్రిత్వ శాఖ నిర్ధారిస్తుంది. వంట నూనెలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ప్రాథమిక జాబితాలో ఉన్నాయి.వీటి ధరలను మార్చాలంటే రిటైలర్లు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో, ప్రాథమిక ఆహార పదార్థాల ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







