9 ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి రిటైలర్లకు అనుమతి లేదు
- November 14, 2022
యూఏఈ: ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా రిటైలర్లు తొమ్మిది ప్రాథమిక వస్తువుల ధరలను పెంచడానికి అనుమతి లేదు. దీనికి సంబంధించిన ప్రాథమిక వినియోగ వస్తువుల కోసం కొత్త ధరల విధానాన్నియూఏఈ కేబినెట్ తాజాగా ఆమోదించింది. ప్రాథమిక నిత్యావసరాల ధరలను నిర్ణయించడంలో విక్రయ కేంద్రాల నిబద్ధతను మంత్రిత్వ శాఖ నిర్ధారిస్తుంది. వంట నూనెలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, బియ్యం, చక్కెర, పౌల్ట్రీ, చిక్కుళ్ళు, బ్రెడ్, గోధుమలు ప్రాథమిక జాబితాలో ఉన్నాయి.వీటి ధరలను మార్చాలంటే రిటైలర్లు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షతన ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో, ప్రాథమిక ఆహార పదార్థాల ధరల పెరుగుదలను అదుపులో ఉంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక విధానాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







