‘మైత్రి’లో బాలయ్య వెర్సస్ చిరంజీవి.!
- November 16, 2022
ఈ ఏడాది సంక్రాంతి పోరు హోరా హోరీగా వుండేలా వుంది. ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’గా, నందమూరి నటసింహం బాలయ్య ‘వీర సింహారెడ్డి’గా ధియేటర్లలో సందడి చేయబోతున్నారు.
ఇరు హీరోల ఫ్యాన్స్కీ ఇది అసలు సిసలు సంక్రాంతి పండగగా చెప్పుకోవచ్చు. ట్విస్ట్ ఏంటంటే, ఈ రెండు సినిమాలూ ఒకే బ్యానర్లో రూపొందాయి. అదే మైత్రీ మూవీస్ బ్యానర్. అలాగే, రెండు సినిమాల్లోనూ హీరోయిన్ కూడా ఒక్కరే. ఆమె ఎవరో కాదు, శృతి హాసన్.
టైటిల్స్ నుంచి నిర్మాణం వరకూ చాలా పోలికలున్నాయ్ ఈ రెండు సినిమాల విషయంలో. అయితే, ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా ఇది. ‘అఖండ’ విజయం తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా ఇది.
దాంతో, మెగాస్టార్ చిరంజీవి సినిమా కన్నా, బాలయ్య సినిమాకే ఎక్కువ స్కోప్ వుందనీ, చిరంజీవి సినిమాని ఎవరూ కొనేందుకు కూడా ముందుకు రావడం లేదనీ బాలయ్య ఫ్యాన్స్ గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సేమ్ బ్యానర్, సేమ్ హీరోయిన్ అంటే, పబ్లిసిటీ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి.
ఈ ఈ సమస్యలను అవకాశంగా తీసుకుని కొందరు నెగిటివ్ వీరులు తమకు తోచిన విధంగా నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. హీరోలైన చిరంజీవి, బాలయ్య బాగానే వుంటారు. మధ్యలో వీరి అత్యుత్సాహమే కొంప ముంచేస్తుంటుంది. ఈ గాసిప్ వీరుల అత్యత్సాహాన్ని కంట్రోల్ చేసే బాథ్యత మైత్రీ వాళ్లదే. చూడాలి మరి ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







