పుస్తక పఠనం పిల్లల హక్కు
- April 23, 2016
ప్రతి ఒక్కరికీ పుస్తకాలు అందించాలనీ, నేటి బాలలే రేపటి పౌరులు గనుక, వారికి విజ్ఞానం అందించేందుకు పుస్తకాలను వారికి చేరువ చేయాలని కలిమత్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ అభిప్రాయపడింది. వరల్డ్ బుక్ డే సందర్భంగా పిల్లలకు పుస్తకాల్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలిమత్ గ్రూప్ ఫౌండర్ మరియు సీఈఓ షకిరీ బోదౌర్ బింట్ సుల్తాన్ అల్ కాసిమి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. షార్జా ఎక్స్పో సెంటర్ వద్ద ఏప్రిల్ 30 నుంచి జరిగే 8వ షార్జా చిల్డ్రన్ రీడింగ్ ఫెస్టివల్ సందర్భంగా కొత్త ఫౌండేషన్ని ప్రారంభిస్తున్నట్లు షేకా బోదౌర్ చెప్పారు. పబ్లిక్ లైబ్రరీలు, రెఫ్యుజీ క్యాంపులు, అలాగే జనసాంద్రత ఎక్కువగ వఆఉండే ప్రాంతాల్లో తాము పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచుతామని ఆమె వివరించారు. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడమే కాకుండా, వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది, సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్న లక్ష్యంతోనే తమ సంస్థ పనిచేస్తుందని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?









