కువైట్‌లో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష అమలు

- November 17, 2022 , by Maagulf
కువైట్‌లో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష అమలు

కువైట్: కువైట్‌లో 2017 తర్వాత తొలిసారిగా దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. వివిధ హత్య కేసులలో ఏడుగురికి పడ్డ మరణశిక్షను సెంట్రల్ జైలులో అధికారులు అమలు చేశారు. ఉరిశిక్ష పడ్డవారిలో ఒక ఇథియోపియన్ మహిళ, ఒక కువైట్ మహిళ, ముగ్గురు కువైట్ పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్థానీ ఉన్నారు. చివరిసారిగా 2017 జనవరి 25న ఏడుగురికి ఉరిశిక్షలు అమలు చేశారు. కాగా, ఉరిశిక్షల అమలుపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com