మద్యం మత్తులో ఇతరుల అపార్ట్మెంట్లోకి.. వ్యక్తికి 10,000 దిర్హామ్ల జరిమానా
- November 17, 2022
దుబాయ్: మద్యం మత్తులో తన పొరుగువారి అపార్ట్మెంట్లోకి చొరబడినందుకు.. దాని నివాసితులు కోరినప్పటికీ బయటకు వెళ్లేందుకు నిరాకరించినందుకు దుబాయ్ మిస్డిమీనర్ -ఉల్లంఘనల కోర్టు ఒక వ్యక్తికి Dh10,000 జరిమానా విధించింది. దుబాయ్ మెరీనాలోని ఓ అపార్ట్మెంట్ భవనంలో గత మే నెలలో ఈ ఘటన జరిగినది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. యూరోపియన్ సంతతికి చెందిన 34 ఏళ్ల నిందితుడు అకస్మాత్తుగా తన అపార్ట్మెంట్లోకి ప్రవేశించడంతో ఆశ్చర్యపోయానని, ఆ వ్యక్తిని లోపలికి రాకుండా ఆపడానికి ప్రయత్నించానని, అయితే నిందితుడు నిరాకరించి, బలవంతంగా లోనికి ప్రవేశించాడని గల్ఫ్ దేశానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఫిర్యాదుదారుని నివాసానికి ఆనుకుని ఉన్న ప్లాట్ లో ఉంటానని, మద్యం మత్తులో గందరగోళానికి గురై వేరే వాళ్ల ప్లాట్ లోకి వెళ్లినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఒక ఇంటి యజమాని ఇష్టానికి వ్యతిరేకంగా వారి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దోషిగా నిర్ధారించి అతనికి 10,000 దిర్హామ్ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!







