మద్యం మత్తులో ఇతరుల అపార్ట్మెంట్లోకి.. వ్యక్తికి 10,000 దిర్హామ్ల జరిమానా
- November 17, 2022
దుబాయ్: మద్యం మత్తులో తన పొరుగువారి అపార్ట్మెంట్లోకి చొరబడినందుకు.. దాని నివాసితులు కోరినప్పటికీ బయటకు వెళ్లేందుకు నిరాకరించినందుకు దుబాయ్ మిస్డిమీనర్ -ఉల్లంఘనల కోర్టు ఒక వ్యక్తికి Dh10,000 జరిమానా విధించింది. దుబాయ్ మెరీనాలోని ఓ అపార్ట్మెంట్ భవనంలో గత మే నెలలో ఈ ఘటన జరిగినది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. యూరోపియన్ సంతతికి చెందిన 34 ఏళ్ల నిందితుడు అకస్మాత్తుగా తన అపార్ట్మెంట్లోకి ప్రవేశించడంతో ఆశ్చర్యపోయానని, ఆ వ్యక్తిని లోపలికి రాకుండా ఆపడానికి ప్రయత్నించానని, అయితే నిందితుడు నిరాకరించి, బలవంతంగా లోనికి ప్రవేశించాడని గల్ఫ్ దేశానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఫిర్యాదుదారుని నివాసానికి ఆనుకుని ఉన్న ప్లాట్ లో ఉంటానని, మద్యం మత్తులో గందరగోళానికి గురై వేరే వాళ్ల ప్లాట్ లోకి వెళ్లినట్లు ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఒక ఇంటి యజమాని ఇష్టానికి వ్యతిరేకంగా వారి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ దోషిగా నిర్ధారించి అతనికి 10,000 దిర్హామ్ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







