CBSE 10+2 ఫార్మాట్ రద్దు.. దానిస్థానంలో 5+3+3+4 స్ట్రక్చర్!
- November 21, 2022
కువైట్: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల ఆధారంగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఫార్మాట్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 10+2 విధానాన్ని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. దాని స్థానంలో 5+3+3+4 విద్యా విధానాన్ని ప్రకటించనుందని సమాచారం. త్వరలోనే కొత్త విధానానికి మారేందుకు అవసరమైన నిబంధనల రూపకల్పన కోసం ఓ కమిటీని వేయనున్నట్లు సమాచారం. NEP 2020లోని కొత్త బోధనా నిర్మాణం పిల్లల విద్యను నాలుగు దశలుగా విభజించింది. మొదటిది ఐదు సంవత్సరాల ఫౌండేషన్ దశ, ప్రిపరేటరీ, మిడిల్ దశలు ఒక్కొక్కటి మూడు సంవత్సరాలు ఉండనుంది. ఇక సెకండరీ దశ నాలుగు సంవత్సరాలు ఉంటుంది. NEPలో భాగంగా 10 నుండి 12 తరగతులకు బోర్డ్ పరీక్షలు కొనసాగుతుండగా.. కోచింగ్ తరగతుల అవసరాన్ని తొలగించడానికి ఈ పరీక్షల విధానంలో మార్పు చేయనున్నారు. NEP ప్రకారం.. విద్యార్థులు విద్యా సంవత్సరంలో రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!









