CBSE 10+2 ఫార్మాట్ రద్దు.. దానిస్థానంలో 5+3+3+4 స్ట్రక్చర్!
- November 21, 2022
కువైట్: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ) 2020 సిఫార్సుల ఆధారంగా.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త ఫార్మాట్ను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 10+2 విధానాన్ని తొలగించాలని యోచిస్తున్నట్లు తెలిపింది. దాని స్థానంలో 5+3+3+4 విద్యా విధానాన్ని ప్రకటించనుందని సమాచారం. త్వరలోనే కొత్త విధానానికి మారేందుకు అవసరమైన నిబంధనల రూపకల్పన కోసం ఓ కమిటీని వేయనున్నట్లు సమాచారం. NEP 2020లోని కొత్త బోధనా నిర్మాణం పిల్లల విద్యను నాలుగు దశలుగా విభజించింది. మొదటిది ఐదు సంవత్సరాల ఫౌండేషన్ దశ, ప్రిపరేటరీ, మిడిల్ దశలు ఒక్కొక్కటి మూడు సంవత్సరాలు ఉండనుంది. ఇక సెకండరీ దశ నాలుగు సంవత్సరాలు ఉంటుంది. NEPలో భాగంగా 10 నుండి 12 తరగతులకు బోర్డ్ పరీక్షలు కొనసాగుతుండగా.. కోచింగ్ తరగతుల అవసరాన్ని తొలగించడానికి ఈ పరీక్షల విధానంలో మార్పు చేయనున్నారు. NEP ప్రకారం.. విద్యార్థులు విద్యా సంవత్సరంలో రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









