భారత్-న్యూజిలాండ్: మూడో టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టై..
- November 22, 2022
న్యూజిలాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో జరిగిన మూడో టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టైగా ముగిసింది. ఈ పద్ధతిలో టై కావడం ఇదే తొలిసారి. భారత్ 3 మ్యాచుల టీ20 సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఇవాళ భారత్ ముందు న్యూజిలాండ్ 161 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. అయితే, 9 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి టీమిండియా 75 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది.
వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. 9 ఓవర్లకు డక్వర్త్ లూయిస్ స్కోరు 75. అయితే, 9 ఓవర్లకు టీమిండియా సరిగ్గా 75 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. టీమిండియా బ్యాట్స్మెన్ లో ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11, సూర్యకుమార్ యాదవ్ 13, శ్రేయాస్ అయ్యర్ 0, హార్దిక్ పాండ్యా 30, దీపక్ హూడా 9 పరుగులు చేశారు. దీంతో భారత్ 9 ఓవర్లకు 75/4 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ 2, ఆడం మిల్నీ, ఇష్ సోధీ చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా వెల్లింగ్టన్ లో మొదటి టీ20 ఆడకుండా వర్షం అడ్డుతగిలింది. అలాగే, మొన్న మౌంట్ మాంగనుయ్ లోని బే ఓవల్ లో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. నేడు నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో మూడో టీ20 డ్రాగా ముగియడంతో భారత్ టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ నెల 25 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









