భారత్-న్యూజిలాండ్: మూడో టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టై..
- November 22, 2022
న్యూజిలాండ్: భారత్-న్యూజిలాండ్ మధ్య నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో జరిగిన మూడో టీ20 డక్వర్త్ లూయిస్ నిబంధనతో టైగా ముగిసింది. ఈ పద్ధతిలో టై కావడం ఇదే తొలిసారి. భారత్ 3 మ్యాచుల టీ20 సిరీస్ ను 1-0 తేడాతో గెలుచుకుంది. ఇవాళ భారత్ ముందు న్యూజిలాండ్ 161 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో భారత టాప్ ఆర్డర్ విఫలమైంది. అయితే, 9 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి టీమిండియా 75 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది.
వర్షం ఎంతకూ తగ్గకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. 9 ఓవర్లకు డక్వర్త్ లూయిస్ స్కోరు 75. అయితే, 9 ఓవర్లకు టీమిండియా సరిగ్గా 75 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. టీమిండియా బ్యాట్స్మెన్ లో ఇషాన్ కిషన్ 10, రిషబ్ పంత్ 11, సూర్యకుమార్ యాదవ్ 13, శ్రేయాస్ అయ్యర్ 0, హార్దిక్ పాండ్యా 30, దీపక్ హూడా 9 పరుగులు చేశారు. దీంతో భారత్ 9 ఓవర్లకు 75/4 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ 2, ఆడం మిల్నీ, ఇష్ సోధీ చెరో వికెట్ తీశారు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా వెల్లింగ్టన్ లో మొదటి టీ20 ఆడకుండా వర్షం అడ్డుతగిలింది. అలాగే, మొన్న మౌంట్ మాంగనుయ్ లోని బే ఓవల్ లో జరిగిన రెండో టీ20 మ్యాచులో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. నేడు నేపియర్లోని మెక్లీన్ పార్క్ లో మూడో టీ20 డ్రాగా ముగియడంతో భారత్ టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ నెల 25 నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







