పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో టి.డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్
- November 25, 2022
హైదరాబాద్: అటవీశాఖ, క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలపై పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేవంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డొబ్రియల్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం లాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో.. స్వయంగా సమావేశం కావాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని మహేందర్రెడ్డి తెలిపారు. అలాగే డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు కూడా తమ పరిధిలోని అటవీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని పోలీస్ అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







