పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో టి.డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్
- November 25, 2022
హైదరాబాద్: అటవీశాఖ, క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలపై పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్పీలతో డీజీపీ మహేందర్రెడ్డి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేవంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డొబ్రియల్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అటవీ అధికారులు, సిబ్బందికి మద్దతుగా నిలవాలని, భరోసా కల్పించాలని ఉన్నతాధికారులకు డీజీపీ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం లాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని సూచించారు. తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో.. స్వయంగా సమావేశం కావాలని పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని మహేందర్రెడ్డి తెలిపారు. అలాగే డీఎస్పీలు, సీఐలు, ఎస్.ఐలు కూడా తమ పరిధిలోని అటవీ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని పోలీస్ అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







