‘మారేడు మిల్లి ప్రజానీకం’: అల్లరోడు అంత సైలెంట్గా వున్నాడేంటీ.?
- November 25, 2022అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం ‘ఇట్టు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమాకి సంబంధించి అప్పుడెప్పుడో ఓ టీజర్లాంటిది రిలీజ్ చేశారు. నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రిలీజ్ టైమ్ అనుకుంటా.. ఆ టైమ్లో ఈ రెండు సినిమాలూ కాస్త ఒకే మాదిరి వున్నాయంటూ కామెంట్లు కూడా వచ్చాయ్.
నితిన్ ఆ మధ్యే తన ‘మాచర్ల ప్రజానీకం’ సినిమాతో వచ్చేశాడు, వచ్చీ వచ్చినట్లే వెళ్లిపోయాడు. కనీసం ఓటీటీ రైట్స్కి కూడా నోచుకోలేదు కాబోలు ఆ సినిమా. ఎప్పుడో ధియేటర్లో రిలీజైనా ఇప్పటి వరకూ ఓటీటీలో రాలేదు.
ఇక, తాజాగా అల్లరి నరేష్ ‘మారేడుమిల్లి నియోజకవర్గం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అసలు ఇదో సినిమా వుందన్న సంగతి ప్రేక్షకులు మర్చిపోయారు. ఈ రోజు రిలీజ్ అనగా, నిన్న ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అది చూస్తే కానీ, ఈ సినిమా ఉనికి తెలియలేదు.
అస్సలు బజ్ లేదీ ఈ సినిమాకి. అల్లరి నరేష్ తన సినిమాలను బాగానే ప్రమోట్ చేసుకోగలడు కదా. అలాంటిది ఈ సినిమాని ఎందుకు లైట్ తీసుకున్నాడు. ఓ రేంజ్లో పబ్లిసిటీ చేస్తే కానీ, ఆ సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదు జనాలు. కొన్ని సార్లు మితిమీరిన పబ్లిసిటీ చేసినా లాభం లేకుండా పోతోంది. అలాంటిది మినిమమ్ పబ్లిసిటీ కూడా లేకుండా వచ్చేశాడు అల్లరి నరేష్. జనం ఎక్కడ పట్టించుకుంటారు సామీ.! అఫ్కోర్స్ సినిమాకి అంత సీనూ సినిమా కూడా లేదని తేల్చేశారు. ఆ విషయం నరేష్ ముందే కనిపెట్టేసి వుంటాడు కాబోలు.! అందుకే లైట్ తీసుకున్నాడేమో.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు