ప్రవాసీ భారతీయ దివస్-2023: కువైట్లో కర్టెన్ రైజర్ ఈవెంట్
- November 26, 2022
కువైట్: ఇండియాలో 2023 జనవరి 8-10 తేదీల్లో "డయాస్పోరా: అమృత్ కాల్లో భారతదేశం పురోగతికి నమ్మకమైన భాగస్వాములు" అనే ఇతివృత్తంతో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగనున్న 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD)-2023 కోసం కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కర్టెన్ రైజర్ ఈవెంట్ను నిర్వహించింది. ఎంబసీ ఛార్జ్ డి అఫైర్స్ స్మితా పాటిల్ మాట్లాడుతూ.. PBD-2023లో పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా కువైట్లోని భారతీయ సమాజ సభ్యులను ఆహ్వానించారు. ఈవెంట్ సందర్భంగా.. పాల్గొనేవారికి రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీలు, లాజిస్టిక్స్ ఏర్పాట్లను వివరిస్తూ ప్రదర్శనలు నిర్వహించారు. అలాగే ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల గురించి అవగాహన కల్పించారు. PBD-2023 కోసం రిజిస్ట్రేషన్ ఫీజుపై 25% తగ్గింపును పొందడం ద్వారా గ్రూప్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ నవంబర్ 3 వరకు గడవు ఉంది. భారతీయ ప్రవాసుల సభ్యుల అభ్యర్థన మేరకు మధ్యప్రదేశ్ టూరిజం హోటల్ ధరలను తగ్గించింది. PBD-2023 నాలుగు సంవత్సరాల విరామం తర్వాత జరగబోతోంది. ఇప్పటి వరకు పదహారు PBD సమావేశాలు నిర్వహించబడ్డాయి. కరోనా మహమ్మారి కారణంగా 2021లో 16వ PBD వర్చువల్ గా నిర్వహించారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







