ముంబైలో కొత్తగా 32 మీజిల్స్ కేసులు
- November 27, 2022ముంబై: ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. నగరంలో కొత్తగా మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పేర్కొంది. దీంతో మొత్తం మీజిల్స్ కేసుల సంఖ్య 300కి చేరింది. వీటిలో గత రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. గురువారం మధ్యాహ్నం గోవండీలోని మురికివాడలో నివాసముంటున్న ఓ 8 నెలల బాలుడు మీజిల్స్ బారిన పడి మృతి చెందాడు.
దీంతో మీజిల్స్తో నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మృతి చెందారు. బీఎంసీ పరిధిలోని ముంబై, మాలేగావ్, భీవాండీ, థాణే, నాసిక్, అకోలా, కళ్యాణ్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు రికార్డు అవుతున్నాయి. దీంతో ఆరోగ్య సిబ్బంది బైకళా, వర్లీ, వడాల, ధారావి, బాంద్రా, అంధేరీ, మలాడ్, గోవండీ, చెంబూర్, కుర్లా, భాండూప్ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నారు.
మొత్తం 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ మీజిల్స్ కేసులు నమోదవు అతున్నాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి