ఓఎన్జీసీ లిమిటెడ్ చమురు అన్వేషణపై దృష్టి..
- April 24, 2016
ఓఎన్జీసీ లిమిటెడ్ చమురు అన్వేషణపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో 17 షెల్గ్యాస్, ఆయిల్ బావులను తవ్వాలని నిశ్చయించుకుంది. దీనికోసం దాదాపు రూ.7,000 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇటీవల జరిగిన అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ సమావేశ అజెండాలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఓఎన్జీసీ తొలిసారిగా భారీఎత్తున షెల్గ్యాస్ అన్వేషణ చేపట్టిందని పీఎస్యూ వర్గాలకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. మెహసానాలో కాంబే బేసిన్లో 11 ప్రాంతాల్లో.. తమిళనాడులోని నాగపట్నంలో ఒక చోట, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కేజీ బేసిన్లో ఐదుచోట్లషెల్గ్యాస్ అన్వేషణ జరిపేందుకు ఓఎన్జీసీ ఇప్పటికే అనుమతులు కోరింది. ఒక్క మెహసాన బేసిన్లో అన్వేషణపైనే దాదాపు రూ.366 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపింది. ఇక కేజీ బేసిన్లో 217 కోట్లు, తమిళనాడులో రూ.45కోట్లు వెచ్చించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







